ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి రమేశ్నగర్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.