విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో త్రాగు నీటి సమస్య లేకుండా చూడాలని కార్పొరేషన్ అధికారులకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా తమకు త్రాగునీరు సమస్యతో కొట్టుమిట్టాడుతున్నామని తమకు త్రాగునీరు అందించే విధంగా చేయాలని కోరుతూ కె ఎల్ రావు నగర్ ప్రాంత వాసులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువెళ్లారు.