విజయవాడ 3వ డివిజన్ కరెన్సీ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. శుక్రవారం పలు రోడ్లకు శంకుస్థాపన చేసి, సి.సి. కెమెరాలు ప్రారంభోత్సవం చేశారు. విజయవాడకు ప్రధాన సమస్య ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజ్, స్టార్మ్ వాటర్. ఈ సమస్యలను ఎంత ఖర్చు అయినా పరిష్కరిస్తామన్నారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో ఆటోనగర్ కు ప్రత్యామ్నాయ మార్గాల పనులు మొదలు కాబోతున్నాయని అన్నారు.