ఏపి మద్యం కేసులో మరో ఇద్దరు నిందితులకు శుక్రవారం సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు నోటీసులిచ్చింది. హైదరాబాద్లోని వారి నివాసాలకు వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారు. కాగా ఏపీలో ఇప్పటికే పలువురిని లిక్కర్ కేసులో విచారించిన సిట్ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నారు.