ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరుల దర్శనార్థం విచ్చేసే భక్తుల సౌకర్యార్థం వివిధ సదుపాయాల కల్పనకు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ చర్యలు తీసుకున్నారు. మంగవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు సంతృప్తిగా వెళ్లే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఓం టర్నింగ్ వద్ద గల బస్ స్టాప్ పరిధి పెంచుతూ, షెడ్ వేసి, భక్తులు ఎండ బారిన పడకుండా చూడాలని అన్నారు.