భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ఎయిర్పోర్టుల్లోనూ సీఐఎస్ఎఫ్, ఎస్పీఎఫ్, స్థానిక పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుపతి ఎయిర్పోర్టు లోపల ఇప్పుడు రెండంచెలుగా ఉన్న భద్రత, తనిఖీలను నాలుగు అంచెలకు పెంచారు.