మంత్రి నారా లోకేష్ గా దృష్టికి పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేసినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ చెరువు మాధవరం వద్ద గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన 230 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటు కోసం వినియోగించాలని కోరినట్లు వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు.