జిల్లాలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. గురువారం ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు.