ఆదోనికి డిగ్రీ కళాశాలకు భవనం కావాలి: విద్యార్థి సంఘాలు

68చూసినవారు
ఆదోనికి డిగ్రీ కళాశాలకు భవనం కావాలి: విద్యార్థి సంఘాలు
ఆదోని డివిజన్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత స్థలం కేటాయించి భవన నిర్మాణం పూర్తి చేయాలని డీఎస్ఎఫ్, పీడీఎస్ఓ విద్యార్థి సంఘాలు శనివారం డిమాండ్ చేశాయి. ఆదోనిలో కళాశాల ఇప్పటికీ అద్దె భవనంలో నడుస్తుండటం దురదృష్టకరమని రాష్ట్ర నాయకులు తిరుమలేష్, జిల్లా కార్యదర్శి ఉదయ్ పేర్కొన్నారు. మైనారిటీ ఐటీఐ భవనం పూర్తిచేసి త్వరగా అడ్మిషన్లు ప్రారంభించాలని కోరారు. ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్