కోడుమూరు పోలీసులు దేశసేవ కోసం పోరాడుతున్న భారత ఆర్మీకి చెందిన సైనికుల తల్లులకు పాదపూజ చేశారు. శనివారం కోడుమూరు స్టేషన్ లో సీఐ తబ్రేజ్, ఎస్సై ఎర్రిస్వామి ఆధ్వర్యంలో భారత ఆర్మీలో వున్న కోడుమూరుకు చెందిన వినోద్, అనిల్, సునీల్ సైనికుల తల్లులకు శాలువకప్పి పూలమాలలతో సత్కరించారు. సీఐ తబ్రేజ్, ఎస్సై ఎర్రిస్వామి వారి పాదాలను కడిగి పాదపూజ నిర్వహించారు. సన్మానం తర్వాత పోలీసులు వారికి గౌరవ వందనం చేశారు.