
పాకిస్థాన్కు IMF ఆర్థిక సాయంపై భారత్ ఆగ్రహం
పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక సాయం ప్రకటించిన నేపథ్యంలో భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఈ అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్పై దాడులు కొనసాగుతున్న టైంలో పాక్కు సాయం ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పశ్చిమ దేశాలు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.