అమరావతిలో రాజధాని పేరుతో చంద్రబాబు అండ్ కో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శించారు. గురువారం కర్నూల్ నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నంద్యాలలో చంద్రబాబును ప్రశ్నించిన ముస్లిం సోదరులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా పేరుతో నాసిరకం వస్తువులను అందించారన్నారు.