పాకిస్తాన్తో జరిగిన యుద్దంలో వీరమరణం పొందిన జిల్లాలోని గోరంట్ల మండలం తల్లి తండాకు చెందిన వీరజవాన్ మురళి నాయక్ చిత్రపటానికి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి నివాళులర్పించారు. శనివారం కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో నాగేశ్వరరావు యాదవ్ తో కలిసి మాట్లాడారు. యుద్ధంలో దేశరక్షణ కోసం ప్రాణాలు విడిచిన వీర జవాన్ ప్రదర్శించిన ధైర్య సాహసం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు.