గొర్రెలు, మేకల దొంగతనాలు ఎక్కువ కావడంతో వాటిని పోషించే వారికి తుపాకీ లైసెన్సులు ఇచ్చేందుకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిందని, అదే తరహాలో ఏపీలో గొర్రెల కాపరులకు తుపాకు లైసెన్సులు ఇవ్వాలని కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న శనివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొర్రెలు, మేకల ప్రదాన వృత్తిగా జీవనం సాగిస్తున్న కురువ కులస్థులను ఆదుకోవాలని కోరారు.