దేవనకొండ మండలం కప్పట్రాళ్ల శ్రీ శక్తి భవనంలో మంగళవారం సే ట్రీస్ ప్రోగ్రామ్ మేనేజర్ నారాయణ రైతులకు పండ్ల తోటల పెంపకంపై అవగాహన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. పండ్లతోటల పెంపకం వైపు రైతులు అడుగులు వేయాలని కోరారు. పండ్ల తోటల పెంపకం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చునన్నారు. రాబోయే రోజులలో కప్పట్రాళ్ల గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని హార్టికల్చర్ హబ్ గా చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.