కర్నూలు జిల్లా ఆదోనిలో రూ. 50 వేల పెన్షన్ డబ్బులను గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లి సచివాలయ ఉద్యోగులకు బురిడీ కొట్టాడు. పట్టణంలోని 27వ వార్డు సచివాలయంలో పెన్షన్కు సంబంధించిన రూ. 17 లక్షలు బ్యాంకు నుంచి సచివాలయ సిబ్బంది డ్రా చేసి తీసుకొచ్చారు. సచివాలయంలో డబ్బులు లెక్కించే సమయంలో ఓ వ్యక్తి మాయమాటల్లో పెట్టి రూ. 50 వేలు ఎత్తుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు.