ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో అన్నదానం కోసం బెంగళూరుకు చెందిన జయలక్ష్మి రూ. 1, 00, 000 ఆదివారం విరాళంగా అందజేశారు. అలాగే గుల్బర్గాకు చెందిన శ్రీవత్స కులకర్ణి రూ. 1, 25, 000 శ్రీ రాఘవేంద్రస్వామి వారి మధ్య ఆరాధన రోజు 21. 08. 2024 నాడు అన్నసంతర్పణ కోసం విరాళంగా అందజేశారు. దాతలను స్వామివారి అర్చకులు ఆశీర్వదించారు.