పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో డ్రైనేజీ పూడిక నిలిచిపోవడంతో మురుగునీరు రోడ్లపైకి రావడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బుధవారం ఏఐఎస్ఎఫ్ నాయకులు లాలు ఈ విషయాన్ని తెలియజేశారు. సర్పంచ్కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. డ్రైనేజీ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.