రమణీయం శ్రీ గిడ్డాంజనేయస్వామి రథోత్సవం

565చూసినవారు
రమణీయం శ్రీ గిడ్డాంజనేయస్వామి రథోత్సవం
పెద్దకడబూరు మండలంలోని తారపురం గ్రామంలో వెలిసిన శ్రీ గిడ్డాంజనేయస్వామి రథోత్సవం బుధవారం అశేష భక్తవాహిణి నడుమ రమణీయంగా జరిగింది. ఆలయ అర్చకులు అనుమేష్ స్వామి, నాగరాజు స్వామి, బసవరాజు స్వామి, పరమేశ్వరస్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్ద భీమ్ సేనరావు కౌశిక్ ఇంటి నుండి గజమాల, పెద్ద వీరారెడ్డి ఇంటి నుండి పూర్ణకుంభం మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా రథం వద్దకు తెచ్చి పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్