డిగ్రీ ప్రైవేట్ కళాశాలల అద్దె భవనాలలో 30 ఏళ్ల వరకు కొనసాగవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబర్ 20 ని విడుదల చేయడంపై రాయలసీమ యూనివర్సిటీ ప్రైవేట్ మరియు అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాలాచారి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఎమ్మిగనూరులో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు జీఓ విడుదల జారీకి కృషి చేసిన మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.