రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చంద్రన్న బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దకడబూరు తెదేపా రైతు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా వెబ్సైట్ను ప్రారంభించిందని, గత మార్చి నెల నుంచి జూన్ లోపు మరణించిన వారి పేర్లు ఆయా గ్రామాల సచివాలయాల్లో నమోదు చేసుకుంటే బీమా వర్తిస్తుందన్నారు.