కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామిని ఆదివారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి దర్శించుకున్నారు. తిక్కారెడ్డికి ఆలయ ఈఓ హెచ్ జి వెంకటేష్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. తిక్కారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఈఓ హెచ్ జి వెంకటేష్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.