మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు ధార్మిక పర్యటనలో భాగంగా బెంగళూరు జయనగర్ శాఖకి ఈరోజు చేరుకున్నారు. పీఠాధిపతికి జయ నగర్ బ్రాంచ్ మేనేజర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మృత్తిక బృందావనాన్ని దర్శించుకున్నారు. ఈరోజు జయ నగర్ బ్రాంచ్ నందు సంస్థాన పూజలలో భాగంగా శ్రీమన్ మూల రామ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా మంగళహారతులు గావించారు.