నంద్యాల మండలంలోని అయ్యలూరు గ్రామ పంచాయతీలో ప్రధాన కాలువ సమస్యను పరిష్కరించాలని శనివారం ఎస్డిపిఐ నాయకులు ఎంపీడీవోను కోరారు. గ్రామ ప్రెసిడెంట్ హబీబుల్లా, కార్యదర్శి ఉమర్, ఇతర నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో త్వరలోనే సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు సమస్య పరిష్కారంపై ఆశాభావం వ్యక్తం చేశారు.