నంద్యాల జిల్లా కోర్టులోని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జి రామిరెడ్డి గారి రాంభూపాల్ రెడ్డి పదవీకాలం శనివారంతో ముగిసింది. వారు మాట్లాడుతూ 2023 జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు 9368 కేసులు పరిష్కరించానని తెలిపారు. ఈ కేసుల ద్వారా కక్షిదారుల నుంచి 4 కోట్లకు పైగా జరిమానా వసూలు చేశామన్నారు. రాష్ట్రంలోనే సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించారని న్యాయవాది అమీర్ తెలిపారు.