పాణ్యంలోని సీఎం చంద్రబాబు సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శబ్దం హోరెత్తించింది. శనివారం ఆమె మాట్లాడుతూ రాయలసీమకు సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల అవసరాన్ని తెలియజేస్తూ కేసీ కెనాల్, అలగనూరు, గోరుకల్లు రిజర్వాయర్ల అభివృద్ధి కోరారు. నంద్యాల మెడికల్ కాలేజీకి ప్రభుత్వ ఆసుపత్రిని కలిపి మెరుగైన వైద్యం అందించాలన్నారు. రాయలసీమను స్వర్ణాంధ్రగా మార్చే నాయకుడు చంద్రబాబు నాయుడేనని ప్రశంసలు గుప్పించారు.