పాములపాడు మండలంలోని కృష్ణానగర్ గ్రామంలో బుధవారం నంద్యాల జిల్లా సగర సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సగర పెద్దలు కొప్పుల నాగేశ్వరరావు, కొప్పుల వెంకటరత్నం, నంద్యాల వెంకటేశ్వర్లు, గ్రామ సగరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. "నంద్యాల జిల్లా సగర సంఘం" చేపట్టే ఏ కార్యక్రమమైనా కృష్ణ నగర్ గ్రామం నుంచే ప్రారంభమవుతుందని అధ్యక్షులు ఇమ్మడి అనిల్ రామయ్య తెలిపారు.