కల్లూరు మండలంలోని గోవర్ధన్ నగర్ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సోమిశెట్టి వెంకటేశ్వర్లు సందర్శించారు. శనివారం దేవాలయ ధర్మకర్త చిలుకూరి వీర ప్రతాప్, ఆలయ కమిటీ సభ్యులు స్వామి వారి దర్శనం చేయించారు. ముందుగా ఆయన పురోహితులు ఆయనను పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లును ఆలయ కమిటీ సభ్యులు సుబ్బరామయ్య ఘనంగా సత్కరించారు.