తమ్మ రాజు పల్లి లో విస్తృత దాడులు

56చూసినవారు
తమ్మ రాజు పల్లి లో విస్తృత దాడులు
పాణ్యం మండలం తమ్మరాజుపల్లి లో గత మూడు రోజులుగా విస్తృత దాడులు జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల, డోన్ ఆర్ ఐ లు అమ్మాజీ, నవీన్ చంద్ర కుమార్ వారి సిబ్బందితో దాడులు నిర్వహించారు. రాయల్టీలు లేని వాహనాలను అదుపులోకి తీసుకోని పాణ్యం పోలీస్ వారికి అప్పగించటం జరిగింది. ఆదివారం రోజున ఎనిమిది జెసిబి లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా పాణ్యం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం.