పత్తికొండ గ్రామ పంచాయతీ వేలం పాటలను సర్పంచ్ కొమ్ము దీపిక ఆధ్వర్యంలో నిర్వహించారు. కూరగాయల మార్కెట్ సుంకం వసూలు చేయు రూ. 4. 10 లక్షలు, వారపు సంత రూ. 91 వేలు, జంతు వధశాల (కబేళా) రూ. 16 వేలు వేలం పాటతో హక్కులు పొందారు. డి ఎల్ పి ఓ ప్రకాష్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ అధికారి నరసింహులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.