ఆత్మకూరు మండల పరిధిలోని అమలాపురం గ్రామంలో అధికారులు ముమ్మరంగా పారిశుధ్య పనులను నిర్వహిస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి మీనాకుమారి ఆధ్వర్యంలో మురుగు నీటి కాలువలను మరియు ప్రధాన వీధులకు త్రాగు నీటి ట్యాంకు లను పారిశుధ్య కార్మికులు శుభ్రపరిచి క్లోరినేషన్ చేశారు. కాలువలు శుభ్రపరిచిన అనంతరం కాలువలో మరియు నీరు నీల్వ ఉండే ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ను చల్లి దోమలు వ్యాప్తి చెందకుండా అరికడుతున్నారు.