ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ కమిటీల నియామక ప్రక్రియ ప్రారంభం అయింది. శనివారం ఎమ్మిగనూరు టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గోనెగండ్ల మండలం లింగందిన్నె మరియు కన్నూరు గ్రామాల కమిటీల అధ్యక్షులు, సభ్యులను నియమించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొని కొత్త కమిటీ సభ్యులు పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు.