ఎమ్మిగనూరు: వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరిచిపోదు: ఆదెన్న

భారత్-పాకిస్తాన్ యుద్ధంలో, ఆపరేషన్ సింధూర్లో పాక్ సైనిక కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ త్యాగాన్ని భారతజాతి ఎప్పటికీ మరిచిపోదని ఎమ్మిగనూరు టిడిపి నాయకులు కదిరికొట ఆదెన్న అన్నారు. శనివారం సాయంత్రం ఎమ్మిగనూరులో సీనియర్ పాత్రికేయులు షబ్బీర్, పాత్రికేయుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాండిలైట్స్ ర్యాలీలో పాల్గొని, సోమప్ప సర్కిల్లో మురళి నాయక్ చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు.