పాకిస్తాన్తో జరిగిన యుద్దంలో వీరమరణం పొందిన అమర జవాన్ మురళీ నాయక్కు ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం ఎమ్మిగనూరులో వైయస్సార్సీపీ ఇంచార్జి బుట్టా రేణుక ఆదేశాల మేరకు అమర జవాన్ మురళీ నాయక్కు శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. దేశ రక్షణలో మురళి నాయక్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని బూట్టా నీలకంఠం అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్, తదితరులు పాల్గొన్నారు.