ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు, ఎమ్మిగనూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి కార్యక్రమం నేత బుట్టా శివనీలకంఠ పార్టీ శ్రేణులతో కలసి నిర్వహించడం జరిగింది. పాకిస్తాన్తో సరిహద్దులో విధి నిర్వహణలో ధైర్యంగా పోరాడి వీర మరణం పొందిన తెలుగు బిడ్డ, భారత సైనికుడు ఎం. మురళీ నాయక్ గారి త్యాగానికి ఎమ్మిగనూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పించారు.