ఆదోని మండలంలోని మదిరె గ్రామ సమీపంలో బైకు అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ఆశావర్కర్ నాగమ్మ, ఆమె కుమారుడు గాయాలపాలయ్యారు. శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పెద్దహరివాణం గ్రామానికి ఆశావర్కర్ నాగమ్మ, ఆమె కుమారుడు బైకుపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సాయంతో వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఔట్పోస్ట్ కానిస్టేబుల్ వెల్లడించారు.