ఉత్తరప్రదేశ్ లోని సంబల్ పట్టణంలో మసీదు సర్వే సందర్భంగా యువకులపై కాల్పులు జరిపిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గురువారం ఆదోనిలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతిపత్రం అందజేశారు. ఆదోనిలో వారు మాట్లాడుతూ కాల్పుల్లో మరణించిన ఐదుగురు యువకుల కుటుంబాలకు రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. జేఏసీ నాయకులు ఎ. నూర్అహ్మద్ తదితరులు ఉన్నారు.