బళ్లారి నివాసితురాలు ఫిరోజేబేగం ఇచ్చిన బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఘటనపై ఆదోని పట్టణంలోని షరాఫ్ బజార్ కు చెందిన బంగారు వ్యాపారులు ఖాదర్ బాషా, సాదిక్ బాషాపై బుధవారం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన 5. 4 తులాల బంగారం, ఇతర ఆభరణాలను వారు తీసుకున్నప్పటికీ, ఫోన్లు చేసి స్పందించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.