నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 19న ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏపి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. గురువారం ఆదోనిలో ఆయన మాట్లాడుతూ 13 కంపెనీలు పాల్గొంటుండగా, మరిన్ని కంపెనీల ప్రతినిధులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.