దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, సైనికుల రక్షణ కోసం ఆదోని బీజేపీ నాయకులు హనుమంతుడి ఆశీర్వాదం అవసరం అని పూజలు నిర్వహించారు. శనివారం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ ఆధ్వర్యంలో ఆదోని యాదవగిరి రణమండల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైనికుల రక్షణకు దేవుని ఆశీస్సులు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైయం నేతలు అంజయ్ కుమార్, గోపాల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.