ఏపీ మాజీ సీఎం జగన్ త్వరలో జైలుకుపోవడం ఖాయమని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ పెద్దహరివాణం మాన్వి దేవేంద్రప్ప జోస్యం చెప్పారు. గురువారం ఆదోనిలో ఆయన మాట్లాడుతూ సొంత పత్రికలో అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో 11 ఎమ్మెల్యే సీట్లు కూడా రాని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. కుట్టు మిషన్ గురించి చేసిన అవినీతి ప్రచారాలపై ఆయన మండిపడ్డారు. త్వరలోనే జగన్ పాపం కూడా పండుతుందన్నారు.