ఆదోని పట్టణ అభివృద్ధి కోసం శుక్రవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవిశెట్టి ప్రకాష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేస్తానని తెలిపారు. దీక్షకు విద్యార్థి, సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు మహిళా సంఘాలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలపాలని కోరారు.