ఆదోని: తాగునీటి సమస్యపై వినతి

76చూసినవారు
ఆదోని: తాగునీటి సమస్యపై వినతి
ఆదోని మండలంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఆర్డబ్ల్యూఎస్, తహసీల్దార్, ఎంపీడీవో అధికారులను ఆదోని పట్టణ జనసేన అధ్యక్షుడు తహర్ వలి ఆ పార్టీ శ్రేణులతో కలిసి వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాల్లో నీటి అవసరాలను తీర్చేందుకు శాశ్వత పరిష్కారాలు తీసుకురావాలని కోరారు. ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా తగిన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.

సంబంధిత పోస్ట్