ఆదోని: తప్పు చేసుంటే క్షమించండి, వైసీపీని వీడే ప్రసక్తే లేదు

63చూసినవారు
ఆదోని మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏదైనా తప్పు చేసుంటే క్షమించాలని, వైసీపీని వీడే ప్రసక్తే లేదని మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోయ శాంత తెలిపారు. గురువారం ఆదోనిలో ఆమె ఆవేదనతో మాట్లాడారు. పదవుల కోసమే కాదు, ప్రజల కోసం పనిచేయడమే లక్ష్యమని, కౌన్సిలర్‌గా కొనసాగి ప్రజాసేవ చేస్తానని చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై త్వరలో మాట్లాడతాన్నారు. అన్నీ విషయాలు ఆదోని ప్రజలకు స్పష్టం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్