ఆదోనిలో వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు రాజు, శివ ప్రసాద్ గౌడ్, ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్టీవో అధికారి శిశిర దీప్తికి శనివారం వినతిపత్రం అందించారు. ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా, పాత వాహనాలను మరమ్మతులు చేయకుండా నడుపుతున్నారని వివరించారు. దీనివల్ల విద్యార్థులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. బస్సులను వెంటనే తనిఖీ చేయాలని కోరారు.