ఆదోని పట్టణంలోని షరాఫ్ బజార్ మెయిన్ ఎంట్రన్స్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసినట్లు గురువారం ట్రాఫిక్ సీఐ గంటా సుబ్బారావు తెలిపారు. వాహనాలను క్రమబద్ధీకరించి, బారికేడ్లతో పక్కన వుంచి, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చేశారు. అలాగే మెయిన్ ఎంట్రాన్స్ దగ్గర విజిబుల్ పోలీసులో భాగంగా వాహనాల తనిఖీ చేస్తూ రికార్డులేని వాహనాలకు జరిమానాలు విధించారు.