హజరత్ శేక్షావలి ఉరుసు మహోత్సవంలో ఎమ్మెల్యే
By W. Abdul 52చూసినవారుఆదోని మండల పరిధిలోని సుల్తాన్పురం గ్రామంలో శుక్రవారం జరిగిన హజరత్ శేక్షావలి ఉరుసు మహోత్సవంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి దర్గాలో ఫాతేహా నిర్వహించారు. దర్శనార్థం దర్గాకు వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామ టీడీపి నాయకులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ప్రజలు సమస్యలు లేకుండా ఆనందంగా ఉండాలని ప్రత్యేక ఫాతేహా చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.