ఆదోని మండలంలో ప్రభుత్వం "అందరికీ ఇల్లు" పథకాన్ని ప్రారంభించినట్లు తహశీల్దార్ శివరాముడు తెలిపారు. శుక్రవారం ఆయన ఆదోనిలో మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన బి.పి.ఎల్ కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలు ప్రభుత్వం నుంచి కేటాయిస్తామన్నారు. గతంలో ప్రభుత్వ స్థలాలు, ఇళ్లు లబ్ధిపొందని వారు ఈ పథకానికి అర్హులవుతారన్నారని తెలియజేశారు.