ఆదోని పట్టణంలోని ఇస్వి రోడ్డులో 103 కేసులలో పట్టుబడిన 1903 లీటర్ల కర్ణాటక మద్యం (రూ. 7. 95 లక్షల విలువ)ను శుక్రవారం ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరిండెంట్ పర్యవేక్షణలో సీఐ సైదుల్ నేతృత్వంలో మున్సిపల్ డంపింగ్ యార్డులో వాహనాలతో మద్యం తొక్కించి నాశనం చేశారు. వాహనాలతో మద్యం తొక్కించి నాశనం చేశారు. అక్రమంగా మద్యం నిల్వ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.