ఆదోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన వెంకటేష్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గురువారం ఎస్సై మహేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. ఆ వివాహిత భర్త తిరుపతికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను వెంకటేష్ లైంగికంగా వేధించినట్టు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పెద్దతుంబళం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు.